Movies

అనసూయ గురించి ఈ విషయాలు తెలుసా..? నిజంగా నమ్మలేరు..?

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం టీవీ తెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. ఐతే అనసూయ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలీదు. తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం టీవీ తెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.

గతేడాది రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఆమె నటించిన ‘కథనం’ మూవీ అనుకున్న ఫలితాన్నిరాబట్టలేకపోయింది. ఐతే అనసూయ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలీదు. ఆమె భర్తతో సోషల్ మీడియలో చాలా సార్లు కనిపించినా.. తల్లిదండ్రులు మాత్రం ఎపుడు కనిపించలేదు. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి.పక్కా తెలంగాణ అమ్మాయి.తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త.ఆయన తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. ఇక అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట.అయితే బద్రుకా కాలేజ్ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకున్న తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసింది.అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రయివేట్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో చేరింది.

అక్కడ పనిచేస్తున్నప్పుడే ఒక పాపులర్ న్యూస్ ఛానెల్‌లో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది.అయినా మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అనసూయను ఎంపిక చేశారు. అయితే ఆమెకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమైంది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ‘నాగ’ వంటి కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా దర్శనమిచ్చింది. కానీ మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకుంది.జబర్దస్త్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
ఆమె అందచందాలు, వాక్చాతుర్యం జబర్దస్త్ షోకు ప్లస్ అయ్యాయి.కాలేజ్ డేస్ లో ఎన్ సీసీ లో పరిచయం అయిన సుషాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో పడిన అనసూయ అతడినే పెళ్లి చేసుకుంది.

ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ భామకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు.అనసూయ భర్త సుశాంక్ ఓ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్. ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో చాన్సులు బాగానే వస్తున్నా తనకు ఇంత లైఫ్ ఇచ్చిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకోనని చెబుతోంది. వెండితెరపై అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, ‘గాయత్రి’,‘కథనం’ వంటి సినిమాలతో టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసింది.గతేడాది రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో ఆమె పేరు మారుమోగిపోయింది.ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది అనసూయ.