Movies

విడాకుల వరకు వెళ్లి మళ్ళీ కలిసి కాపురం చేస్తున్న టాలీవుడ్ జంటలు

టాలీవుడ్ లో గానీ బాలీవుడ్ లో గానీ ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని,అన్యోన్యంగా చివరిదాకా ఉంటున్న వాళ్లూ;విడిపోయిన వాళ్ళూ ఉన్నారు. అయితే విడాకుల దాకా వెళ్లి,మళ్ళీ కలసిపోయిన వాళ్ళూ ఉన్నారు. అలాంటి జంటల విషయానికి వస్తే,ఒకటి అందాల నటి రంభ 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ కుమార్ ని పెళ్ళాడి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆరేళ్ళ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు ఇప్పించాలని రంభ కోర్టుని ఆశ్రయించింది. తన ఇద్దరు బిడ్డల సంరక్షణకు నెలకు 2న్నర లక్షలు పరిహారం కింద ఇప్పించాలని కోర్టుకి విన్నవించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్న రంభ,తిరిగి భర్తతో ఉండడానికి నిర్ణయించుకుని,కోర్టుకి తెలపడంతో ఇద్దరి మధ్యా చర్చలు జరిగి ఫలించాయి. దీంతో కోర్టు ఆమె వేసిన విడాకుల పిటిషన్ కొట్టేసింది.

అలాగే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే నటుడు పృథ్విరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని 1984లో పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదని భార్య విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది . ఇద్దరికీ కోర్టు విడాకులు కూడా మంజూరు చేస్తూ 8లక్షల రూపాయల పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆతర్వాత ఇద్దరూ కల్సి మాట్లాడుకోవడంతో మళ్ళీ కల్సి ఉంటున్నారు. మంచిదైన మా అమ్మ మనసు ఎవరో విరిచేశారని,అయితే నాన్న మంచివారని కొడుకు మీడియాకు వెల్లడించారు.

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టాక ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. దీంతో కొడుకుని తీసుకుని నమ్రత ముంబయి వెళ్ళిపోయింది. సరిగ్గా అదేసమయంలో మహేష్ కెరీర్ లో ఒడిడుకులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇద్దరు కల్సి మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యంగా ఉంటున్నారు.