RRR ని డామినేట్ చేస్తున్న ఆచార్య…చిరు వేస్తున్న ప్లాన్
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి తర్వాత ప్రస్తుతం మన టాలీవుడ్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఇటీవల దీనికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కూడా ఖరారు చేసేసారు. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక రాజమౌళి రాం చరణ్, ఎన్.టి.ఆర్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటు చిత్ర పరిశ్రమ తో పాటు ప్రేక్షకులలోను భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో బాహుబలిలా మరో భారీ పాన్ ఇండియా సినిమా గా ఫాన్స్ ఫిక్సైపోయారు.
ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ అన్న ఒక స్పెషల్ వీడియో రెడీ అవుతుందని తాజా గా వస్తున్న టాక్. అంతేకాదు చరణ్ వీడియో కంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఈ వీడియోలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు సీన్స్ రివీల్ అవుతాయని అంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తుండగా… 2021 జనవరి 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఒక న్యూస్ ని బట్టి మళ్ళీ ఫ్యాన్స్ కి నిరాశే అని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా కి టెక్నికల్ ఇష్యూస్ బాగా తలెత్తాయట. అంతేకాదు, ఇంకా షూటింగ్ వర్క్ చాలా పెండింగ్ ఉండగా వీ.ఎఫ్.ఎక్స్, సీ.జీ.వర్క్ కంప్లీట్ అయ్యేలా లేదని టాక్. దాంతో ఆ డేట్ ని ఆచార్య సినిమా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుందట. కాస్త అదే డేట్ కి ప్రేక్షకుల ముందుకు ఆచార్య సినిమా తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టు కొరటాల అన్ని కార్యక్రమాలు నవంబర్ లోపు కంప్లీట అయ్యోలా నవంబర్ నుండి జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టేలా పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నాడట. మొత్తానికి ఆచార్య ముందుకు వస్తోందని టాక్.