Movies

“సరిలేరు నీకెవ్వరు” రెండో టెలికాస్ట్ ఎప్పుడో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. సంక్రాంతి కానుకగా విడుడలయ్యి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ చిత్రం బుల్లితెర మీద కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని మొదటిసారి టెలికాస్ట్ చేసిన జెమినీ టీవిలో ఆల్ టైం టీఆర్పీ రికార్డు నమోదు అయ్యింది.

దీనితో పాటుగా మళ్ళీ ఇదే గ్యాప్ లో ఈ చిత్రం రెండోసారి టెలికాస్ట్ కు సిద్ధం కానుంది అని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈసారి డిలీట్ చేసిన సన్నివేశాలు మరియు ఒరిజినల్ హై క్వాలిటీ ఆడియోతో టెలికాస్ట్ కానుంది అనడంతో ఈసారి కూడా మహేష్ అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి డేట్ కుదిరినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జెమినీ టీవీ వారు ఈ ఏప్రిల్ 26 ఆదివారం గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈసారి కూడ మహేష్ ఆల్ టైం టీఆర్పీ నెలకొల్పుతారో లేదో చూడాలి.