Movies

రాజమౌళి శ్రీయకు సీరియస్ వార్నింగ్….ఎందుకో తెలుసా?

పక్కా ప్లాన్ తో వెళ్తూ, ఏ విషయం లీక్ కాకుండా సినిమా తీసి హిట్ కొట్టడం ఎస్ ఎస్ రాజమౌళి శైలి. అందుకే తన ప్రతి సినిమాకు సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచుతాడు. బాహుబలి రెండు పార్ట్ ల గురించి చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు ఏ ఒక్క విషయాన్ని కూడా బయటకి పొక్కనీయలేదు. తమ పాత్ర ఏంటీ కథ ఏంటీ ఎక్కడ షూటింగ్ జరుగుతుందనే విషయాలను బయట చెప్పవద్దంటూ ముందే నటీ నటులకు /టెక్నీషియన్స్ కు జక్కన్న సీరియస్ గా చెప్తాడు.

ఇక మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి రామ్ చరణ్ ను కాని ఎన్టీఆర్ ను కాని అడిగినప్పుడు ఎప్పుడు కూడా వారు కనీసం చిన్న హింట్ ఇచ్చేలా మాట్లాడలేదు. ఏ విషయం అయినా రాజమౌళిని అడగాల్సిందే. ఆయన నుండి ప్రకటన రావాల్సిందే అని నవ్వేస్తూ తప్పించుకుంటారు. అయితే తాజాగా శ్రియ మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలో తాను నటిస్తున్నానని ప్రకటించింది.

అంతేకాదు, తన పాత్ర ఏంటో కూడా క్లారిటీ ఇస్తూ, .. తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్ లో శ్రియ చెప్పేసింది. అజయ్ దేవగన్ భార్య పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాన ని, సినిమాలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని శ్రియ మాటలతో అర్థం అయ్యింది. ఇన్నాళ్లుగా కథ గురించి కనీసం చిన్న లీక్ కూడా రాలేదు. ఇప్పుడు శ్రియ మాటలతో ఎవరికి తోచినట్లు వారు కథ అల్లేస్తున్నారు. సీక్రెట్ బయటకు వచ్చేయడంతో జక్కన్న తట్టుకోలేక హర్ట్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రియపై కూడా సీరియస్ అయినట్లు టాక్.