Movies

మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకుల ఆస్తి తగాదాలు నిజమేనా… ?

నిజామా.. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నడుమ ఆస్తి తగాదాలేంటి అని చర్చించుకోవడం,కలికాలం కాదా అని అనుకోవడం సహజం. అయితే ఆస్తి గొడవ మాత్రం నిజమే కానీ అది రియల్ లైఫ్ లో మాత్రం కాదట. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. సైరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్ వలన నిలిచిపోయిన ఈ షూటింగ్ సడలింపులు తర్వాత మళ్లీ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్న రామ్ చరణ్ పాత్ర దాదాపు అరగంట ఉంటుంది. ఈ విషయాన్నీ అఫీషియల్ గా చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేసాడు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఖైదీ నెం 150 తర్వాత మరోసారి చిరుతో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సందేశాత్మక సినిమాలకు పెట్టింది పేరైన కొరటాల శివ ‘ఆచార్య’ను కూడా అలాగే తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్ర కథలో భాగంగా దేవాదాయ భూముల ఆక్రమణలపై దర్శకుడు కొరటాల ఫోకస్ చేస్తున్నాడని టాక్ .ఇందులో చరణ్ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. ఆచార్యలో రామ్‌ చరణ్‌, చిరంజీవి మధ్య ఓ ఫైట్‌ సీన్‌ ఉంటుందని ప్రచారం టాక్.

చిరంజీవి అండర్‌ కవర్‌ అధికారిగా దేవాదాయ శాఖ అధికారిగా భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తాడని అంటున్నారు. అయితే నక్సలైట్‌ అయిన రామ్‌ చరణ్‌ను పట్టుకోడానికి చిరు ప్రయత్నిస్తుంటాడని.. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య దేవాదాయ భూముల ఆస్తుల గొడవ నడుస్తోందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, డైరెక్టర్ కొరటాల ఈ ఫైట్ సీన్‌పై చాలా కేర్ తీసుకుంటున్నాడు . అద్భుతంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసు కుంటున్నాడు.. మొత్తానికి నిజ జీవితంలో కాకుండా రీల్ లైఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదా భలే రంజుగా ఉండబోతోందన్నమాట.