Movies

నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి…తను కూడా …?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకని కొంతకాలం పాటు హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలపై మనసు మళ్లడంతో అక్కడికి మకాం మార్చి బాగానే రాణిస్తోంది. ప్రస్తుతం తాప్సీ పన్ను బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు వినీల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్న హసీనా దిల్ రుబా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే తమిళ భాషలో కూడా జన గన మణ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా తాప్సీ పన్ను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఫాన్స్ తో ముచ్చటించింది. ఈమధ్య సినిమా పరిశ్రమ లో నెపోటిజం మీద చర్చ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. ఇక తాప్సి కూడా నెపోటిజం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో ముఖ్యంగా తాను కూడా ఒకప్పుడు నెపోటిజం కారణంగా పలు సినిమా అవకాశాలను కోల్పోయానని తాప్సి చెప్పింది. కొందరు దర్శక నిర్మాతలు మొదటగా తనకి సినిమా అవకాశం ఇచ్చిన తర్వాత డబ్బు, పలుకుబడి, బందు ప్రీతి వంటి కారణాలతో తనని తప్పించి ఇతరులకి అవకాశం ఇచ్చేవారని ఈ అమ్మడు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే సినిమా పరిశ్రమలో మనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత మనపైనెపోటిజం ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేసింది.