సుకుమార్ కారణంగా పుష్ప నిర్మాతలకు కోట్ల నష్టం…నిజమా ?
Pushpa Movie Makers Loss : అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం పుష్ప: ది రైజ్ మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమా విశేష ప్రేక్షాదరణ పొందుతున్నప్పటికీ ఈ సినిమా వెస్టీజ్ కి సంబంధించి 30కోట్లు నష్టపరిచేలా డైరెక్టర్ సుకుమార్ వ్యవహరించాడని ఒక వార్త తాజాగా వైరల్ అవుతోంది.
రష్మిక మందన్నా హీరోయిన్గా చేసిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్లో అలరించింది. ఇక పుష్ప 2కూడా రాబోతోంది. దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అయితే రెండున్నర గంటల సినిమాకు 4గంటల ఫుటేజ్ తీస్తారని అయితే పుష్ప విషయంలో వెస్టీజ్ ఎక్కువ అయిందని అంటున్నారు.
పోనీ వెస్టీజ్ కాకుండా పుష్ప 2లో పెడదామా అంటే అక్కడ కూడా పనికొచ్చేలా లేదట. ముఖ్యంగా సమంత స్పెషల్ సాంగ్ లో ఫుటేజ్ ఎక్కువ తీయడం వలన కోటి రూపాయల వరకూ నష్టపోయారని టాక్. డైరెక్టర్ సుకుమార్ తగు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వలన మొత్తం మీద 30 కోట్లు నష్టమని అంటున్నారు. వెస్టీజ్ సహజమే అయినా ఇదీ మరీ ఎక్కువని గుసగుసలు విన్పిస్తున్నాయి.