Beauty TipsHealth

Home Remedies For Crack Heels:ఇలా చేస్తే 2 రోజుల్లో పాదాల పగుళ్లు మాయం అవుతాయి..ఇది నిజం

Home Remedies For Crack Heels :చలికాలం వచ్చిందంటే పాదాల పగుళ్లు ఉన్నవారికి ఈ సమస్య చాలా తీవ్రం అయిపోతుంది. పాదాలపై సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం, తేమను కోల్పోవడం, చర్మంలోని పగుళ్ళకు దుమ్ము ధూళి చేరి సమస్య మరింతగా పెరిగి నడవడానికి ఇబ్బంది గాను చూడటానికి కాస్త చికాకుగాను అనిపిస్తుంది.

పాదాల పగుళ్లు తగ్గించుకోవటానికి రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే పాదాల పగుళ్ళు చాలా తొందరగా తగ్గిపోతాయి. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఒక బౌల్ లో అర స్పూన్ పసుపు., అర స్పూన్ కర్పూరం పొడి,అర స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పసుపు కొమ్ములను ఆడించిన పసుపు అయితే మంచిది.

ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని పోసి దానిలో ఒక షాంపూ, అర చెక్క నిమ్మరసం పిండి అందులో పాదాలను 10 నిమిషాల పాటు నుంచి ఆ తర్వాత ఫ్యుమిక్ స్టోన్ తో పాదాలను శుభ్రపరచాలి. ఇలా చేయడం వలన పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

పాదాలను పొడి క్లాత్ తో శుభ్రంగా తుడిచి పసుపు, కర్పూరం మిశ్రమాన్ని పాదాలకు రాసి సాక్స్ వేసుకోవాలి. రాత్రి సమయంలో ఈ విధంగా రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను ప్రతిరోజు చేస్తూ ఉంటే నాలుగు రోజుల్లో పాదాల పగుళ్లు మాయం అయిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.