MoviesTollywood news in telugu

Guppedantha Manasu Saroja:గుప్పెడంత మనసు సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్ ఎవరో తెలుసా..?

Guppedantha Manasu Saroja:గుప్పెడంత మనసు సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్ ఎవరో తెలుసా..గుప్పెడంత మనసు సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషి రాకతో గుప్పెడంత మనసు సీరియల్ రేంజ్ మారిపోయింది.

అయితే రిషి ఆటో డ్రైవర్ రంగాగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త కథ, కథనాలతో సరికొత్తగా ప్రసారం అవుతోంది. రంగా వేరూ.. రిషి వేరు. ఈ రంగాకి ఒక కుటుంబం ఉంది. ఈ సీరియల్ లో రంగా మరదలు సరోజగా కొత్త పాత్ర ఎంటర్ అయింది.

రంగ మరదలు సరోజ పాత్రలో వినీత నటిస్తుంది. ఇమే సీరియల్స్‌లోకి రాకముందు తమడా మీడియాలో పనిచేసింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసి.. చివరకు సీరియల్స్ లో సెటిల్ అయింది.

ఈవీటీలో అను- పల్లవి సీరియల్‌లో నటించిన వినీత.. జీ తెలుగులో ‘దేవతలారా దీవించండి’, ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్స్‌లో నటించింది. వీటితో పాటు.. పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది వినీత. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచ్‌లు పేల్చింది వినీత.

ఇక గుప్పెడంత మనస్సు సీరియల్ తో ఇమే రేంజ్ బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు మంచి పేరు వచ్చింది.