MoviesTollywood news in telugu

keerthy suresh:కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంత.. ఏమి చేసిందో తెలుసా..?

keerthy suresh:కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంతో తెలుసా… సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన కీర్తి సురేష్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్.

2000లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి. మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలోనే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసి మలయళంలో గీతాంజలి సినిమా ద్వారా కథానాయికగా అడుగుపెట్టింది.

ఆ తర్వాత టాలీవుడ్ కి నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చాలా బిజీగా ఉంది. కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు దాదాపుగా మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది.

మొదట బాలనటిగా నటించిన కీర్తి సురేష్ తన పారితోషికం మొత్తం తన తండ్రికి ఇచ్చేదట. కాలేజీ రోజుల్లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు 500 రూపాయల పారితోషికం ఇచ్చారట. కీర్తి సురేష్ మొదటి పారితోషికం 500 రూపాయిలు అని ఆమె ఒక సినిమా ప్రమోషన్ లో బాగంగా చెప్పింది. ప్రస్తుతం కీర్తి హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది.