Saraswathidevi : సరస్వతి దేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది.. నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది?
నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు. వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పం గా హిందువులు గౌరవిస్తారు.సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు ఎదోకనాటికి హరించుకుపోతాయి, కాని విద్య బండరాయి లా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియ పర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది.ఆమె హంస నే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేమిటంటే… హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదు కదా!
కాని హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుందట. అంటే విద్య వల్ల వివేకం, విజ్ఞానం లభిస్తాయని తెలియపర్చటానికే ఆమె హంసవాహిని అయింది.ఇక నెమలి ఆమె వద్ద ఎందుకు ఉంటుందంటే… సమస్త ప్రాణులు ఆడమగ కలిసి సంభోగం చేస్తాయి. కాని నెమలికి సంభోగం ఉండదు. పవిత్ర పక్షి యిది. మగ నెమలి కంటి నీటిని త్రాగి గ్రుడ్డు పెడుతుంది. రతిక్రియ జరుపని పక్షి ఇదొక్కటే. విద్య పవిత్రమైనదని, విద్య నేర్చుకోనేపుడు పవిత్రంగా ఉండాలని తెలియపర్చటానికే నెమలిని సరస్వతిదేవి వద్ద చిత్రిస్తారు. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి. https://shorturl.at/ftM6u Follow the ChaiPakodi WhatsApp channel: https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి. https://amzn.to/3YqNRsQ